కస్టోడియన్ భూములను కాపాడతాం
ABN, First Publish Date - 2021-05-27T09:46:13+05:30
కాప్రాలోని ప్రభుత్వ కస్టోడియన్ భూము లు అన్యాక్రాంతం కాకుండా కాపాడతామని మేడ్చల్ జిల్లా అడిషనల్ కలెక్టర్ ఎ.నర్సింహారెడ్డి స్పష్టం చేశారు.
మేడ్చల్ అడిషనల్ కలెక్టర్ నర్సింహారెడ్డి
కాప్రా, మే 26 (ఆంధ్రజ్యోతి): కాప్రాలోని ప్రభుత్వ కస్టోడియన్ భూము లు అన్యాక్రాంతం కాకుండా కాపాడతామని మేడ్చల్ జిల్లా అడిషనల్ కలెక్టర్ ఎ.నర్సింహారెడ్డి స్పష్టం చేశారు. కాప్రాలోని 152, 153 సర్వే నెంబర్ల భూ వ్యవహారంలో ఎమ్మెల్యే భేతి సుభా్షరెడ్డి, తహసీల్దార్ గౌతమ్కుమార్లపై కేసులు నమోదైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం ఆయన కాప్రా తహసీల్దార్తో సమావేశమై మండల పరిధిలోని ప్రభుత్వ స్థలాలు, కస్టోడియన్ భూములతో పాటు తాజా పరిణామాలపై చర్చించారు.
Updated Date - 2021-05-27T09:46:13+05:30 IST