ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గౌరవెల్లి భూ నిర్వాసితుల సమస్యలు పరిష్కరించే వరకు పోరాడుతాం: చాడ వెంకటరెడ్డి

ABN, First Publish Date - 2021-12-27T21:50:59+05:30

గౌరవెల్లి ప్రాజెక్టు భూ నిర్వాసితుల సమస్యలు పరిష్కరించే వరకు వెన్నంటే ఉండి పోరాడుతామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సిద్దిపేట: గౌరవెల్లి ప్రాజెక్టు భూ నిర్వాసితుల సమస్యలు పరిష్కరించే వరకు వెన్నంటే ఉండి పోరాడుతామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అన్నారు. సోమవారం సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గుడాటిపల్లిలో ఆయన పర్యటించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం బాధితుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. గౌరవెల్లి  ప్రాజెక్టు పూర్తయితే ఈ ప్రాంతానికి సాగునీరు అందుతుందన్నారు. బాధితులకు పరిహారం చెల్లించి పనులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. న్యాయం కోసం పోరాడిన నిర్వాసితులపై లాఠీఛార్జ్ చెయ్యడం దుర్మార్గమన్నారు. ఎమ్మెల్యే నిర్వాసితుల దీక్ష వద్దకు రావాలి సమస్యను పరిష్కరించాలని చాడ వెంకటరెడ్డి డిమాండ్ చేశారు.

Updated Date - 2021-12-27T21:50:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising