ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వరంగల్ జిల్లా: నర్సంపేటలో దారుణం

ABN, First Publish Date - 2021-05-13T18:09:07+05:30

వరంగల్: రూరల్ జిల్లా, నర్సంపేట శివారు కాకతీయనగర్ కాలనీలో కబ్జా ముఠా రెచ్చిపోయింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వరంగల్: రూరల్ జిల్లా, నర్సంపేట శివారు కాకతీయనగర్ కాలనీలో కబ్జా ముఠా రెచ్చిపోయింది. దుండగులు స్థానికులపై దౌర్జన్యానికి తెగబడ్డారు. ఇక్కడ అసైన్డు భూముల్లో నెలరోజులుగా గుడిసెలు వేసుకుని సుమారు 3 వందల కుటుంబాలు జీవిస్తున్నాయి. ఇదే భూమిపై కన్నేసిన స్థానిక బాడా బాబులు వారి అనుచరులతో పేదల గుడిసెలపై దాడి చేయించారు. సుమారు 40 మంది దుండగులు మారణాయుధాలతో వచ్చి బీభత్సం సృష్టించారు. పడుకున్నవారిపై విచక్షణారహితంగా దాడి చేయడంతోపాటు వాడి గుడిసెలు దగ్ధం చేశారు. మహిళలు, వృద్ధులు, చిన్నారులు అన్న తేడా లేకుండా అందరిపై పాశవికంగా దాడి చేశారు. సమాచారం అందుకుని రంగంలోకి దిగిన పోలీసులు కొందరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలియవచ్చింది. గురువారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది.

Updated Date - 2021-05-13T18:09:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising