ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మెట్రోలో.. నేలపై.. పసికందుతో మహిళ

ABN, First Publish Date - 2021-10-26T08:40:25+05:30

రైలు బోగీ నిండుగా జనం.. ఒక్క సీటూ ఖాళీ లేదు..! చేతిలో పసికందు..! అయ్యో చంటిపాపతో ఉన్నదే అని.. ఆమె కోసం ప్రయాణికులెవరూ సీటును త్యాగం చేయలేదు..!

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • సీట్లలో ఫోన్లు చూస్తూ యువతులు, మహిళలు
  • ఇదేనా మానవత్వమంటూ సోషల్‌ మీడియాలో వైరల్‌


హైదరాబాద్‌ సిటీ, అక్టోబరు 25(ఆంధ్రజ్యోతి): రైలు బోగీ నిండుగా జనం.. ఒక్క సీటూ ఖాళీ లేదు..! చేతిలో పసికందు..! అయ్యో చంటిపాపతో ఉన్నదే అని.. ఆమె కోసం ప్రయాణికులెవరూ సీటును త్యాగం చేయలేదు..! అంతేకాదు మొబైల్‌ ఫోన్లు చూసుకుంటూ, ముచ్చట్లు పెట్టుకుంటూ కనీసం పట్టించుకోలేదు. దీంతో.. విధిలేక ఓ మహిళ శిశువుతో బోగీలో నేలపై కూర్చుని ప్రయాణించిన దృశ్యాన్ని కొంతమంది ప్రయాణికులు వీడియో తీసి షేర్‌ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. హైదరాబాద్‌ మెట్రో రైల్‌లో చోటుచేసుకుందీ ఘటన. కాగా, సీట్లలోని వారంతా చదువుకున్నవారేనని కనిపిస్తుండడంతో ఇదేనా మానవత్వం అంటూ నెటిజన్లు మరింత మండిపడుతున్నారు. ఇతర రవాణా వాహనాల్లోలాగే మెట్రో రైళ్లలోనూ బాలింతలు, గర్భిణులు, వృద్ధులు, దివ్యాంగులకు ప్రాధాన్యం కల్పించాలని పలువురు కోరుతున్నారు.

Updated Date - 2021-10-26T08:40:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising