‘ఈటలకు ఎందుకు ఓటెయ్యాలి? హుజురాబాద్ సమస్యలపై రాజీనామా చేశారా?’
ABN, First Publish Date - 2021-10-21T17:36:41+05:30
కరీంనగర్కు రైల్వేలైన్ ప్రతిపాదనలు కేంద్రం రద్దు చేస్తే.. బండి సంజయ్ ఏం చేస్తున్నారని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్ ప్రశ్నించారు.
కరీంనగర్: కరీంనగర్కు రైల్వేలైన్ ప్రతిపాదనలు కేంద్రం రద్దు చేస్తే.. బండి సంజయ్ ఏం చేస్తున్నారని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్ ప్రశ్నించారు. జాతీయ రహదారుల పనులు ఎందుకు ముందుకు సాగడం లేదని నిలదీశారు. కేంద్రాన్ని ఒప్పించి కొత్త ప్రాజెక్టు తెచ్చే బాధ్యత సంజయ్కి లేదా? అని ప్రశ్నించారు. అసలు ఈటలకు ఎందుకు ఓటెయ్యాలని నిలదీశారు. ఈటల ఏమైనా హుజురాబాద్ సమస్యలపై రాజీనామా చేశారా? అని వినోద్కుమార్ ప్రశ్నించారు.
Updated Date - 2021-10-21T17:36:41+05:30 IST