ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేసీఆర్ సర్వేలపై విజయశాంతి ఆసక్తికర వ్యాఖ్యలు

ABN, First Publish Date - 2021-02-27T23:44:26+05:30

నాగార్జున సాగర్ ఉపఎన్నికలో తామే గెలుస్తామని పర్సెంటేజి లెక్కలతో సహా సీఎం కేసీఆర్ చెప్పుకోవటం హాస్యాస్పదమని బీజేపీ నాయకురాలు విజయశాంతి అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: నాగార్జున సాగర్ ఉపఎన్నికలో తామే గెలుస్తామని పర్సెంటేజి లెక్కలతో సహా సీఎం కేసీఆర్ చెప్పుకోవటం హాస్యాస్పదమని బీజేపీ నాయకురాలు విజయశాంతి అన్నారు. సోషల్ మీడియా వేదికగా సీఎం కేసీఆర్‌పై శనివారం విమర్శలు గుప్పించారు. టీఆర్ఎస్ నిలబెట్టే అభ్యర్థి కబ్జాకోరో... దోపిడీదారో తెలిశాక.. ప్రజలు ఏ స్థానం ఇయ్యాలో నిర్ణయిస్తారన్నారు. అలాగే ఎమ్మెల్సీ ఎన్నికలపై ముఖ్యమంత్రివి ఊహాగానాలని ఎద్దేవా చేశారు. అవన్నీ అవకతవక పిచ్చి సర్వేలని కొట్టిపడేశారు. గతంలో దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికలప్పుడు తాను చెప్పింది కూడా అదే తీరున జరిగిందన్నారు. అంతేకాకుండా రాష్ట్ర పార్టీ అధ్యక్షులు బండి సంజయ్‌కి లోకసభ స్పీకర్ అనుమతి లభించినట్లయితే... ఈ అసత్యాల ముఖ్యమంత్రి పాల్పడ్డ అనేక మోసాలలో మరొకటి బయటపడి, ప్రజలకు మరింత స్పష్టత ఏర్పడుతుందన్నారు.  



Updated Date - 2021-02-27T23:44:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising