ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సోనియాను కలిశాకే కొత్త, పాత కమిటీ గురించి మాట్లాడతా: వీహెచ్

ABN, First Publish Date - 2021-07-24T19:46:31+05:30

తన ఆరోగ్యం విషయంలో సోనియాగాంధీ పాటు ఇతర నాయకులూ అందరూ తనను పరామర్శించారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: తన ఆరోగ్యం విషయంలో సోనియాగాంధీ పాటు ఇతర నాయకులూ అందరూ తనను పరామర్శించారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు తెలిపారు. నేడు తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వీహెచ్ మాట్లాడుతూ.. ‘‘చాలా మంది హాస్పిటల్‌కి నన్ను కలవడానికి వచ్చారు. అందరికీ కృతజ్ఞతలు. బడుగు బలహీన వర్గాల వాళ్లకి నా సేవలు అవసరమని మా సోనియాగాంధీ తెలిపారు. రాజకీయాల్లోకి సేవ చేయాలని వచ్చాను. అంతే తప్ప డబ్బులు సంపాదించడానికి రాలేదు. సోనియా గాంధీ నాతో మాట్లాడటం వల్ల నాకు మరింత దైర్యం పెరిగింది. నా మిగతా జీవితం అంతా బడుగు బలహిన వర్గాలకి సేవ చేస్తాను. ఎక్కడ పేదవారికి ఆపద ఉన్నా ఆదుకునే పవన్ కళ్యాణ్ నా అరోగ్య విషయంలో నాకు లెటర్ రాశారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తాను. నేను ఎక్కడ ఆపద ఉంటే అక్కడ ఉంటాను. మా నాయకురాలిని కలిసిన తరువాత కొత్త కమిటీ, పాత కమిటి గురించి మాట్లాడతాను. అప్పటివరకూ ఏమీ మాట్లాడను’’ అని పేర్కొన్నారు.


Updated Date - 2021-07-24T19:46:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising