ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Vemulawada Rajarajeswara స్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు..

ABN, First Publish Date - 2021-11-01T12:20:53+05:30

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ రాజరాజేశ్వర క్షేత్రం ఆదివారం భక్తులతో కిక్కిరిసిపోయింది. సెలవుదినం కావడంతో వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు స్వామివారి దర్శనం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కిక్కిరిసిన రాజన్న క్షేత్రం

20వేల మందికి పైగా భక్తుల రాక


రాజన్న సిరిసిల్ల/వేములవాడ: రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ రాజరాజేశ్వర క్షేత్రం ఆదివారం భక్తులతో కిక్కిరిసిపోయింది. సెలవుదినం కావడంతో వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు స్వామివారి దర్శనం కోసం పెద్ద సంఖ్యలో వేములవాడకు తరలివచ్చారు. ఈ సందర్భంగా ఇష్టదైవమైన  రాజరాజేశ్వరస్వామిని దర్శించుకున్నారు. స్వామివారికి ప్రీతిపాత్రమైన కోడెమొక్కు చెల్లించుకున్నారు.  ఆలయ కల్యాణకట్టలో తలనీలాలు సమర్పించారు.  స్వామివారి నిత్యకల్యాణం, కుంకుమపూజ, సత్యనారాయణవ్రతం వంటి ఆర్జిత సేవల్లో పాల్గొన్నారు. ఆదివారం సందర్భంగా లఘుదర్శనం అమలు చేశారు. దీంతో భక్తులు నందీశ్వరుడి విగ్రహం వద్ద నుంచి స్వామివారిని దర్శించుకున్నారు. సుమారు 20 వేల మంది స్వామివారిని దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. వేములవాడ దేవస్థానానికి అనుబంధంగా ఉన్న బద్దిపోచమ్మ దేవాలయంలోనూ భక్తుల రద్దీ కనిపించింది. అమ్మవారిని దర్శించుకొని బోనం మొక్కు చెల్లించుకున్నారు. 

Updated Date - 2021-11-01T12:20:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising