వ్యాక్సినేషన్ వద్ద తోపులాట
ABN, First Publish Date - 2021-07-25T06:25:56+05:30
వ్యాక్సినేషన్ వద్ద తోపులాట
చిట్యాల, జూలై 24: మండల కేంద్రంలోని సామాజి ఆస్పత్రిలో శనివారం నిర్వహించిన వ్యాక్సినేషన్లో గందగోళం ఏర్పడింది. వివిధ గ్రామాలకు చెందిన సుమారు 400 మంది చేరుకోగా అందరికీ సరిపడా వ్యాక్సిన్ అందుబాటులో లేదని తెలియడంతో ఒక్కసారిగా తోపులాట జరింగింది. దీంతో ఇద్దరు మహిళలు కిందపడిపోయారు. పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ క్రమంలో వ్యాక్సిన్ కోసం వచ్చిన వారు ఆస్పత్రి సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. పొలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.
Updated Date - 2021-07-25T06:25:56+05:30 IST