అడవుల సంరక్షణ అందరి బాధ్యత
ABN, First Publish Date - 2021-02-28T04:58:39+05:30
అడవుల సంరక్షణ అందరి బాధ్యత
వాజేడు, ఫిబ్రవరి 27: అడవుల సంరక్షణ మనందరి బాధ్యత అని వాజేడు ఎఫ్ఆర్వో శ్రీనివాసన్ అన్నారు. శనివారం మండలంలోని టేకుల గూడెంలో అటవీశాఖ ఆధ్వర్యంలో అడవిలో జరిగే అగ్ని ప్రమా దాల నివారణకోసం అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా శ్రీని వాసన్ మాట్లాడుతూ అడవు లకు వెళ్లే వ్యక్తులు నిప్పు కలిగి ఉండ రాదని, పెట్రోల్, డీజిల్ వెంట తీసుకెళ్లవద్దని అన్నారు. సమీప అడవ ుల్లో నిప్పు పెట్టరాదని, ఒకరు వేసే నిప్పు మొత్తం అడవులు దహన మయ్యే ప్రమాదం ఉందని అన్నారు. దాని ఫలితంగా వన్య ప్రాణులు, జీవరాశులు అంతరించిపోతాయని అన్నారు. అనంతరం అడవులకు నిప్పుపెట్టవద్దనే పోస్టర్ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో సర్పంచ్, కార్యదర్శితోపాటు ప్రజలు, అటవీశాఖ సిబ్బంది పాల్గొన్నారు.
Updated Date - 2021-02-28T04:58:39+05:30 IST