రైతుల పోరాటానికి యూటీఎఫ్ సంఘీభావం
ABN, First Publish Date - 2021-01-18T08:58:59+05:30
కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతులకు తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ సమాఖ్య(యూటీఎఫ్) సంఘీభావం ప్రకటించింది
కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతులకు తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ సమాఖ్య(యూటీఎఫ్) సంఘీభావం ప్రకటించింది. సమాఖ్య రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో అధ్యక్షుడు కె.జంగయ్య, ప్రధాన కార్యదర్శి చావ రవి సహా రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన 50 మంది ప్రతినిధులు ఢిల్లీ వెళ్లి రైతుల పోరాటంలో పాల్గొని మద్దతు తెలిపారు. ఈ పోరాటం స్పూర్తితో ఉపాధ్యాయులు కూడా విద్యా రంగంలో కార్పొరేటీకరణకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. రైతుల ఉద్యమానికి సంఘీభావంగా రాష్ట్ర యూటీఎఫ్ తరఫున రూ.3 లక్షల సహాయాన్ని అందించారు.
Updated Date - 2021-01-18T08:58:59+05:30 IST