తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు: కిషన్ రెడ్డి
ABN, First Publish Date - 2021-03-01T17:49:26+05:30
పట్టభద్రుల ఎన్నికలను భ్రష్టుపట్టించడానికి.. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం మహబూబ్నగర్లో ఆయన
మహబూబ్నగర్: పట్టభద్రుల ఎన్నికలను భ్రష్టుపట్టించడానికి.. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం మహబూబ్నగర్లో ఆయన పర్యటించారు. పర్యటన అనంతరం కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక చట్టసభలు నిర్వీర్యం అయ్యాయని ఆరోపించారు. తెలంగాణ ప్రజలు మార్పుకోరుకుంటున్నారని, సీఎం కేసీఆర్ కు అభద్రతాభావం పెరిగిందని విమర్శించారు. హైదరాబాద్లో గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్, బీజేపీకి కేవలం ఎనిమిది వేల ఓట్లు మాత్రమే తేడా అన్నారు. కానీ ఇప్పుడు జరిగే ఎన్నికలు మేధావుల ఎన్నికలని..ఇలాంటి ఎన్నికల్లో ఎప్పుడూ మేధావుల ఆశీస్సులతో బీజేపీ గెలుస్తుందని జోస్యం చెప్పారు.
Updated Date - 2021-03-01T17:49:26+05:30 IST