రామప్పకు ప్రపంచ గుర్తింపు.. ప్రధాని మోదీ హర్షం
ABN, First Publish Date - 2021-07-25T23:41:03+05:30
రామప్ప దేవాలయానికి ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు లభించడం పట్ల ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా...
న్యూఢిల్లీ: రామప్ప దేవాలయానికి ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు లభించడం పట్ల ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. కాకతీయుల కళాత్మకతకు ప్రతీకగా రామప్ప దేవాలయం నిలుస్తుందని ఆయన ట్వీట్ చేశారు. ఘనమైన కట్టడాన్ని అందరూ సందర్శించి.. గొప్ప అనుభూతి పొందాలని ప్రధాని కోరారు.
Updated Date - 2021-07-25T23:41:03+05:30 IST