ఇద్దరు ఉపాధ్యాయుల సస్పెన్షన్
ABN, First Publish Date - 2021-03-02T05:15:37+05:30
ఇద్దరు ఉపాధ్యాయుల సస్పెన్షన్
బయ్యారం, మార్చి 1 : విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన ఇరువురు ఉపాధ్యాయులను సస్పెండ్ చేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి ఈఎ్సఎస్ శర్మ పేర్కొన్నారు. డీఈవో వెల్లడించిన వివరాల ప్రకారం మండలంలోని సింగారం ప్రాథమికోన్నత పాఠశాల్లో మొత్తం ఏడుగురు ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. ఇందులో ప్రధానోపాధ్యాయుడు జి.లింగ, ఉపాధ్యాయుడు బాలాజీ ఎటువంటి ముందస్తు అనుమతి లేకుండా పాఠశాలను విడిచివెళ్లడంతో సీసీఏ రూల్స్ ప్రకారం సస్పెండ్ ఉత్తర్వులు జారీ చేసినట్లు పేర్కొన్నారు. అదేవిధంగా విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన మరో ముగ్గురు ఉపాధ్యాయులు బి.బిచ్చా, బి.వెంకన్న, జి.వెంకన్నకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. ఈసందర్భంగా డీఈవో మాట్లాడుతూ కొవిడ్-19 కారణం గా విద్యార్థులు ఇప్పుడిప్పుడే పాఠశాలలకు వస్తున్న క్రమంలో ఉపాధ్యాయులంద రూ నిబద్ధతో పనిచేసి విద్యా ప్రమాణాలను పెంపొందించాలన్నారు.
Updated Date - 2021-03-02T05:15:37+05:30 IST