జవహర్ నగర్లో ఇద్దరు విద్యార్థినిలు మిస్సింగ్
ABN, First Publish Date - 2021-11-27T02:33:59+05:30
నగరంలోని జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని
హైదరాబాద్: నగరంలోని జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇద్దరు విద్యార్థినిలు మిస్సింగ్ అయ్యారు. వీరిద్దరూ గీతాంజలి కాలేజీలో చదువుతున్నారు. కాలేజీ యాజమాన్యం కొట్టినందుకు ఇద్దరు అమ్మాయిలు కనిపించకుండా పోయారు. విద్యార్థినిలు ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. జవహర్ నగర్ పోలీస్ స్టేషన్లో తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. విద్యార్థినిల కోసం పోలీసులు వెతుకుతున్నారు.
Updated Date - 2021-11-27T02:33:59+05:30 IST