సిద్దిపేట: వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి
ABN, First Publish Date - 2021-07-24T03:18:16+05:30
జిల్లాలో జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందారు. హుస్నాబాద్
సిద్దిపేట: జిల్లాలో జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందారు. హుస్నాబాద్ పట్టణంలో ఎదురెదురుగా వస్తున్న కారును బైక్ ఢీకొట్టింది. ఈ ఘటనలో మహిళ మృతి చెందింది. మరొకరికి తీవ్రగాయాలయ్యాయ. గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు.
మరో ఘటనలో కొండపాక మండలంలోని కూకునూర్పల్లి శివారులో డివైడర్ను బైక్ ఢీకొట్టింది. ఒకరు మృతి చెందారు. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. మృతి చెందిన వ్యక్తిని రాయపోల్ మండలం కొత్తపల్లి వాసి యాదయ్యగా గుర్తించారు.
Updated Date - 2021-07-24T03:18:16+05:30 IST