ఎన్టీఆర్ వర్థంతి ఘనంగా నిర్వహించాలని టీటీడీపీ నిర్ణయం
ABN, First Publish Date - 2021-01-18T02:15:34+05:30
దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 25వ వర్థంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు
హైదరాబాద్: దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 25వ వర్థంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ తెలిపారు. రేపు ఉదయం 8 గంటలకు ఎన్టీఆర్ ఘాట్లో టీడీపీ అధినేత చంద్రబాబు నివాళులర్పించనున్నట్లు చెప్పారు. అలాగే రసుల్పుర నుంచి ఎన్టీఆర్ ఘాట్ వరకు ఉదయం 9గంటలకు అమరజ్యోతి ర్యాలీలో బాలకృష్ణ, నందమూరి సుహాసిని పాల్గొననున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాన కార్యక్రమాలు నిర్వహించాలని కార్యకర్తలను కోరారు. తెలుగు వారికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు రావటానికి కారణం ఎన్టీఆర్ అని చెప్పారు. పేదలను రాజకీయాల్లోకి తీసుకొచ్చిన ఘనత ఎన్టీఆర్కే దక్కుతుందని పేర్కొన్నారు.
Updated Date - 2021-01-18T02:15:34+05:30 IST