ఈటలను గ్రామాల్లో అడ్డుకోవాలి: మోత్కుపల్లి
ABN, First Publish Date - 2021-10-20T08:51:42+05:30
ఈటలను గ్రామాల్లో అడ్డుకోవాలి: మోత్కుపల్లి
యాదాద్రి రూరల్, అక్టోబరు 19: హుజూరాబాద్ నియోజకవర్గంలో ‘దళతబంధు’ అమలు కాకుండా చేసిన బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ను గ్రామాలకు రానివ్వకుండా ప్రజలు అడ్డుకోవాలని మాజీ మంత్రి, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు పిలుపునిచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట్టలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. వారం రోజుల్లో ఉప ఎన్నిక ఉండగా ఈటల రాజేందర్ ‘దళితబంధు’ అమలు కాకుండా చేశారన్నారు. దళితుల నోట్లో మట్టికొట్టిన ఈటలకు ఓటుతో బుద్ధి చెప్పాలన్నారు.
Updated Date - 2021-10-20T08:51:42+05:30 IST