ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీజేపీ నాయకుల భరతం పడతాం: చీఫ్ విప్ దాస్యం

ABN, First Publish Date - 2021-11-11T22:16:37+05:30

రైతులను మోసం చేస్తున్న బీజేపీ నాయకుల భరతం పడతామని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హనుమకొండ: రైతులను మోసం చేస్తున్న బీజేపీ నాయకుల భరతం పడతామని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ హెచ్చరించారు. సీఎం కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించబోమని, ప్రజాక్షేత్రం నుంచి ఉరికిస్తామని బీజేపీ నాయకులను వినయ్ భాస్కర్ హెచ్చరించారు. కేంద్రమే ధాన్యం కొనుగోలు చేయాలని కోరుతూ టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించే రైతుల ధర్నాపై వినయ్ బాస్కర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులను చావుదెబ్బ కొట్టేలా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కుట్రలు చేస్తోందని ఆరోపించారు. రైతులకు అండగా నిలిచేందుకే శుక్రవారం నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలకు పార్టీ పిలుపునిచ్చిందన్నారు. హనుమకొండ చౌరస్తా నుంచి ఏకశిల పార్క్ వరకు శుక్రవారం ర్యాలీ నిర్వహించి ధర్నా చేస్తామన్నారు. బీజేపీ ప్రజావ్యతిరేక విధానాలను ఎండగడతామన్నారు. రైతులను మోసం చేస్తున్న బీజేపీ నాయకుల భరతం పడతామన్నారు. తెలంగాణ ఉద్యమంలో బీజేపీ నాయకులు ఎక్కడున్నారని ఆయన ప్రశ్నించారు. 

Updated Date - 2021-11-11T22:16:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising