ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాంగ్రెస్‌ బాటలోనే టీఆర్‌ఎస్‌ పాలన: కిషన్‌రెడ్డి

ABN, First Publish Date - 2021-04-11T07:56:44+05:30

కాంగ్రెస్‌ బాటలోనే టీఆర్‌ఎస్‌ పార్టీ పాలన సాగిస్తోందని.. అందుకే రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉప ఎన్నిక మేనిఫెస్టో విడుదల 

హాలియా, ఏప్రిల్‌ 10: కాంగ్రెస్‌ బాటలోనే టీఆర్‌ఎస్‌ పార్టీ పాలన సాగిస్తోందని.. అందుకే రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా హాలియాలో బీజేపీ ఉప ఎన్నికల మేనిఫెస్టోను శుక్రవారం ఆయన విడుదల చేశారు. జానారెడ్డి చేతిలో అధికారం ఉన్న సమయంలో నియోజకవర్గానికి చేసింది శూన్యమని విమర్శించారు. ఎత్తుకు పైఎత్తులు వేశాడే తప్ప జిల్లాకు, నియోజకవర్గానికి ఒరిగిందేమీ లేదన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తండాలను గ్రామ పంచాయతీలుగా చేసి ఊరుకుందని.. అభివృద్ధి మాత్రం చేయలేదని ఆరోపించారు. జ్యూస్‌ ఫ్యాక్టరీ ఊసే మరచిందన్నారు. సాగర్‌లో బీజేపీని గెలిపిస్తే ఇండస్ర్టియల్‌ కారిడార్‌ రీజినల్‌ రింగ్‌ రోడ్డు నుంచి సాగర్‌ వరకు రోడ్డు నిర్మిస్తామని మంత్రి చెప్పారు. గిరిజనులకు 12ు రిజర్వేషన్ల అమలుకు, కేంద్ర విద్యాలయం ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. కాంగ్రెస్‌, టీఆర్‌ఎ్‌సలు మాయమాటలతో ప్రజలను మోసం చేస్తున్నాయని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు మండిపడ్డారు. ఆ రెండు పార్టీలూ నాణేనికి బొమ్మాబొరుసు వంటివని విమర్శించారు.

Updated Date - 2021-04-11T07:56:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising