తెలంగాణలో రాజకీయాలు చండాలంగా తయారయ్యాయి: లక్ష్మారెడ్డి
ABN, First Publish Date - 2021-09-16T03:42:06+05:30
తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు చండాలంగా తయారయ్యాయని మాజీ మంత్రి
మహబూబ్ నగర్: తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు చండాలంగా తయారయ్యాయని మాజీ మంత్రి, టీఆర్ఎస్ ఎమ్మెల్యే చర్నకోల లక్ష్మారెడ్డి ఆవేదన వ్యక్తం చేసారు. జడ్చర్లలో ఆయన మాట్లాడారు. తెలంగాణలో ఎవరేం మాట్లాడుతున్నారో అర్థంకాని పరిస్థితి ఉందని లక్ష్మారెడ్డి అన్నారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదన్నారు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా బాధ్యతగా వ్యవహరించాలని ఆయన సూచించారు. ప్రభుత్వాలు చేసే ప్రతి పనిని విపక్షాలు విమర్శించడం సరికాదని లక్ష్మారెడ్డి పేర్కొన్నారు.
Updated Date - 2021-09-16T03:42:06+05:30 IST