కేటీఆర్ అధ్యక్షత మరికాసేపట్లో పార్టీ కార్యనిర్వహక భేటి
ABN, First Publish Date - 2021-07-14T16:12:24+05:30
కేటీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్లో పార్టీ కార్యనిర్వహక సమావేశం జరగనుంది.
హైదరాబాద్: టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతన బుధవారం తెలంగాణ భవన్లో పార్టీ కార్యనిర్వహక సమావేశం జరగనుంది. ప్రధానంగా ఈ భేటీలో ఆరు అంశాల అజెండాపై చర్చించనున్నారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలపై విశ్లేషణ, పార్టీ సభ్యత్వ నమోదు, డిజిటైజేషన్ ప్రక్రియ, టీఆర్ఎస్ సభ్యుల జీవిత భీమా, జిల్లా పార్టీ కార్యాలయాల నిర్మాణాల పురోగతి, పార్టీ ఇతర వ్యవహారాలపై చర్చలు జరపనున్నారు. మంత్రి కేటీఅర్ అనుమతితో ఇతర ఏమైన అంశాలపై చర్చించే అవకాశముంది. పూర్తి సమాచారంతో రాష్ట్రం కార్యవర్గ సభ్యులు సమావేశానికి రావాలని కేటీఆర్ సూచించారు.
Updated Date - 2021-07-14T16:12:24+05:30 IST