ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సునీల్ ఆత్మహత్యకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే కారణం: ఉత్తమ్‌

ABN, First Publish Date - 2021-04-03T00:33:07+05:30

విద్యార్థి సునీల్ నాయక్ ఆత్మహత్యకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే కారణమని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: విద్యార్థి సునీల్ నాయక్ ఆత్మహత్యకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే కారణమని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ టీఆర్ఎస్ పాలకులు నిరుద్యోగుల పట్ల అనుసరిస్తున్న నిర్లక్ష్యానికి ఇది పరాకాష్ట అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగుల పక్షాన ముందుండి పోరాటం చేస్తుందని తెలిపారు. తెలంగాణలో ఎవ్వరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని, కోట్లాడి సాధించుకుందామని చెప్పారు. సునీల్‌నాయక్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి డిమాండ్ చేశారు. 


రాష్ట్రంలో ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్ జారీ చేయడం లేదని సునీల్ ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. అతని పరిస్థితి విషమించడంతో హైదరాబాదులోని నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. నిమ్స్‌లో చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మృతిచెందాడు. సునీల్ విద్యార్థుల సమస్యలపై పోరాటం చేసేవాడని తోటి విద్యార్థులు చెబుతున్నారు. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ ప్రభుత్వం నిరుద్యోగులను పట్టించుకోవడంలేదని పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసి ఈ విషయాన్ని సెల్ఫీ వీడియోలో తెలిపాడు. 

Updated Date - 2021-04-03T00:33:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising