ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ నేతల వాగ్వాదం

ABN, First Publish Date - 2021-04-16T06:56:57+05:30

టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ నేతల వాగ్వాదం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మహదేవపూర్‌, ఏప్రిల్‌ 15: మండలంలోని అన్నారం గ్రామంలో మంథని ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు చేతుల మీదుగా బుధవారం నిర్వహించిన అంబేద్కర్‌ విగ్రహ ఆవిష్కరణ టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ నేతల మఽధ్య గురువారం వాగ్వాదానికి దారి తీసింది. తమకు సమాచారం ఇవ్వకుండా విగ్రహ ఆవిష్కరణకు ఎమ్మెల్యేను ఆహ్వానించడం సమంజసం కాదని కాంగ్రెస్‌ నాయకులపై టీఆర్‌ఎస్‌ నాయకులు మండిపడ్డారు. ఎమ్మెల్యే వస్తున్నారని తెలిస్తే తామూ జడ్పీ చైర్‌మన్‌ను ఆహ్వానించే వాళ్లమని టీఆర్‌ఎస్‌ నాయకుడు శ్రీనివాస్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము విగ్రహ ఆవిష్కరణ కమిటీలో ఉన్నప్పటికీ ప్రాధాన్యమివ్వ కపోవడమేమిటని నిలదీశారు. రెండు పార్టీల నాయకుల మఽధ్య మాటామాట పెరిగి వాగ్వాదానికి దారి తీయడంతో సమాచారం అందుకున్న డీఎస్పీ అంబటి నర్సయ్య, ఎస్సై నరహరి నాయక్‌ అక్కడికి చేరుకొని పరిస్థితిని అదుపు చేశారు. సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని ఇరు వర్గాలను నచ్చజెప్పారు. అనవసరంగా గొడవలకు దిగితే కేసులు పెడతామని హెచ్చరించారు.


Updated Date - 2021-04-16T06:56:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising