పరువు హత్యలపై హైకోర్టులో విచారణ
ABN, First Publish Date - 2021-04-01T21:44:22+05:30
పరువు హత్యలపై హైకోర్టులో విచారణ జరిగింది. పరువు హత్యలపై కోర్టులో డీజీపీ మహేందర్రెడ్డి నివేదిక సమర్పించారు.
హైదరాబాద్: పరువు హత్యలపై హైకోర్టులో విచారణ జరిగింది. పరువు హత్యలపై కోర్టులో డీజీపీ మహేందర్రెడ్డి నివేదిక సమర్పించారు. పరువు హత్యలను అరికట్టేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని కోర్టుకు డీజీపీ తెలిపారు. పరువు హత్యలను తీవ్రంగా పరిగణించి దర్యాప్తు చేస్తున్నామని నివేదిక తెలిపారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలు పాటిస్తున్నామని ఆయన హైకోర్టులో నివేదించారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలను ఎలా అమలు చేశారో తెలపాలని హైకోర్టు ఆదేశించింది. పరువు హత్యలు ఎన్ని జరిగాయి? అని న్యాయస్థానం ప్రశ్నించింది. దర్యాప్తు ఏ స్థాయిలో ఉందో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. సామాజిక కార్యకర్త సాంబశివరావు పిల్ పై విచారణ ఆగస్టు 5కి హైకోర్టు వాయిదా వేసింది.
Updated Date - 2021-04-01T21:44:22+05:30 IST