2022 ఆగస్టు 15 తర్వాత ప్రభుత్వం రద్దు: రేవంత్రెడ్డి
ABN, First Publish Date - 2021-07-10T00:25:16+05:30
కేసీఆర్పై టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 2022 ఆగస్టు
హైదరాబాద్: కేసీఆర్పై టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 2022 ఆగస్టు 15 తర్వాత కేసీఆర్, తన ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికలకు వెళ్తాడని రేవంత్రెడ్డి జోస్యం చెప్పారు. కేటీఆర్కు ముఖ్యమంత్రి పదవిని కేసీఆర్ ఇవ్వడని ఆయన స్పష్టం చేశారు. అమరవీరుల స్థూపం పేరుతో పెద్ద దోపిడీ జరిగిందన్నారు.
నేను టీడీపీ అయితే కేసీఆర్ ఏంటి?
నపై విమర్శలు చేస్తున్న టీఆర్ఎస్ నాయకులపై టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నేను టీడీపీ అయితే కేసీఆర్ ఏ పార్టీ అని రేవంత్రెడ్డి ప్రశ్నించారు. కేసీఆర్ టీఆర్ఎస్కి ఎలా అధ్యక్షుడో, తాను కాంగ్రెస్కు అధ్యక్షుడినని రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. కేసీఆర్ కేబినెట్లో 75 శాతం మంత్రులు టీడీపీవారనని రేవంత్రెడ్డి ఎద్దేవా చేశారు. హరీష్రావు, కేటీఆర్కు రాజకీయ బిక్ష పెట్టింది కాంగ్రెస్, టీడీపీ కాదా అని ఆయన ప్రశ్నించారు. టీ కాంగ్రెస్ టీడీపీ అయితే, టీఆర్ఎస్ కూడా టీడీపీనేనని ఆయన అన్నారు. టీఆర్ఎస్ను తరమికొట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. మోసానికి, దోపిడీకి మారుపేరు కల్వకుంట్ల కుటుంబమని ఆయన ఆరోపించారు. అధికారాన్ని టీఆర్ఎస్ నుంచి బరాబర్ గుంజుకుంటామని రేవంత్రెడ్డి పేర్కొన్నారు.
టీఆర్ఎస్తో మాకు పాము, ముంగిస ఫైట్
టీఆర్ఎస్తో మాకు పాము, ముంగిస ఫైట్ జరుగుతోందని రేవంత్ అన్నారు. టీఆర్ఎస్ గాలి వాటం పార్టీ అని, దానికి నిర్మాణం లేదన్నారు. భవిష్యత్లో టీఆర్ఎస్ ఉండదన్నారు.
తన పేరు మీదనే కిషన్రెడ్డికి కేంద్రమంత్రి పదవి వచ్చిందన్నారు. "నాకు పీసీసీ వచ్చింది కాబట్టే.. కిషన్రెడ్డికి కేబినెట్ పదవి" వచ్చిందని రేవంత్ పేర్కొన్నారు. బీజేపీలో చేరాక ఈటలకు ఉద్యమంతో బంధం తెగిపోయింద రేవంత్ పేర్కొన్నారు. బీజేపీలో చేరి లెఫ్టిస్ట్ ఈటల రాజేందర్ క్యాపిటలిస్ట్గా మారాడని రేవంత్రెడ్డి ఆరోపించారు.
Updated Date - 2021-07-10T00:25:16+05:30 IST