వేయిస్తంభాల గుడిని దర్శించిన దంతెవాడ ఎమ్మెల్యే
ABN, First Publish Date - 2021-01-20T05:15:36+05:30
వేయిస్తంభాల గుడిని దర్శించిన దంతెవాడ ఎమ్మెల్యే
వరంగల్ కల్చరల్, జనవరి 19 : హన్మకొండలోని వేయిస్తంభాల ఆలయాన్ని మంగళవారం ఛతీ్సగఢ్ రాష్ట్రంలోని దంతేవాడ ఎమ్మెల్యే దేవతి కర్మ కుటుంబ సభ్యులతో కలిసి సందర్శించారు. జడ్ కేటగిరి పోలీసు బందోబస్తు మధ్య వచ్చిన ఆమెకు ఆలయ మర్యాదల తో స్వాగతం పలికారు. గణపతి దర్శనం అనంతరం రుద్రేశ్వరునికి అష్టోత్తర శతనామార్చన జరిపించారు. అనంతరం తీర్థ ప్రసాదాలను చేశారు. ఆమె మాట్లాడు తూ ఛత్తీగఢ్లో కాకతీయులు నిర్మించిన దేవాలయం ఉందని, ప్రతీ ఏడాది ఉత్సావాలను నిర్వహిస్తామని పేర్కొన్నారు. కాకతీయుల చరిత్ర ఎంతో గొప్పదని, వారి వారసత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు, ఆలయ ప్రధాన అర్చకులు గంగు ఉపేంద్రశర్మ ఆలయ పాశస్త్యాన్ని వారికి వివరించారు.
Updated Date - 2021-01-20T05:15:36+05:30 IST