ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మోల్నుపిరావిర్‌పై మూడో దశ పరీక్షలు

ABN, First Publish Date - 2021-05-20T08:33:24+05:30

మోల్నుపిరావిర్‌పై మూడో దశ క్లినికల్‌ పరీక్షలు నిర్వహించడానికి ఆప్టిమస్‌ ఫార్మాకు డీసీజీఐ అనుమతిచ్చింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

2,500 మందిపై అధ్యయనం.. డీసీజీఐ అనుమతి

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): మోల్నుపిరావిర్‌పై మూడో దశ క్లినికల్‌ పరీక్షలు నిర్వహించడానికి ఆప్టిమస్‌ ఫార్మాకు డీసీజీఐ అనుమతిచ్చింది. ఒక మాదిరి నుంచి స్వల్ప లక్షణాలున్న కరోనా రోగులకు మోల్నుపిరావిర్‌ను వాడుతున్నారు. మోల్నుపిరావిర్‌ ఫార్ములేషన్‌, దానికి అవసరమైన ఏపీఐని కంపెనీ సొంతంగా అభివృద్ధి చేసుకున్నట్లు ఆప్టిమస్‌ ఫార్మా వెల్లడించింది. అనుమతించిన ప్రొటోకాల్‌ ప్రకారం 2,500 మందిపై అధ్యయనం నిర్వహిస్తారు. వీరిలో స్వల్ప, ఒక మాదిరి తీవ్రత కలిగిన కొవిడ్‌ రోగులు ఉంటారు. ఈ పరీక్షలు కొవిడ్‌ రోగులపై ఔషధం సమర్థతను తెలియజేస్తాయని ఆప్టిమస్‌ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ డి.శ్రీనివాస రెడ్డి తెలిపారు. దేశీయ మార్కెట్లో కొవిడ్‌ చికిత్స కోసం యాంటీ వైరల్‌ ఔషధాలకు గిరాకీ అనూహ్యంగా పెరిగిపోతోందని.. దీన్ని అధిగమించడానికి తాము ఉత్పత్తి చేసే మోల్నుపిరావిర్‌ దోహదం చేయగలదన్నారు. 

Updated Date - 2021-05-20T08:33:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising