ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చిన్నారి కుటుంబ సభ్యుల ఆందోళన.. దిగొచ్చిన పోలీసులు..

ABN, First Publish Date - 2021-09-16T20:21:30+05:30

హైదరాబాద్: సింగరేణి చిన్నారి ఘటనలో నిందితుడు రాజు మృతదేహాన్ని.. బాధిత కుటుంబ సభ్యులకు చూపిస్తామని పోలీసులు తెలిపారు. చనిపోయింది రాజేనా, కాదా అనే విషయంలో తమకు అనుమానం ఉందని, మృతదేహాన్ని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: సింగరేణి చిన్నారి ఘటనలో నిందితుడు రాజు మృతదేహాన్ని.. బాధిత కుటుంబ సభ్యులకు చూపిస్తామని పోలీసులు తెలిపారు. చనిపోయింది రాజేనా, కాదా అనే విషయంలో తమకు అనుమానం ఉందని, మృతదేహాన్ని చూపించాలని చిన్నారి కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు దిగొచ్చారు. మృతదేహాన్ని వారికి చూపించడానికి కుటుంబ సభ్యులను వరంగల్ ఎంజీఎంకు పోలీసులు.. తమ వాహనంలోనే తీసుకెళ్లనున్నారు. బాధితురాలి మేనమామతో పాటు 5 గురు సింగరేణి కాలనీ వాసులను కూడా తీసుకెళ్లనున్నట్లు తెలిపారు. రాజు మృతదేహాన్ని తమకు అప్పగించాలని, అప్పుడే తాము అంగీకరిస్తామని.. చిన్నారి బంధువులు డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.


మరోవైపు నిందితుడు రాజు మృతిపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. పోస్ట్‌మార్టం అనంతరం రాజు మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని తెలిపారు. అయితే రాజు మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు కుటుంబ సభ్యులు ముందుకు రావడం లేదు.

Updated Date - 2021-09-16T20:21:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising