జడ్జిల పెంపు ఫైలుపై నాముందే సంతకం
ABN, First Publish Date - 2021-06-18T09:15:08+05:30
హైకోర్టు న్యాయమూర్తుల పోస్టుల సంఖ్యను 24 నుంచి 42కు పెంచిన ఫైలుపై కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తన ముందే సంతకం చేశారని కేంద్ర మంత్రి జి.కిషన్రెడ్డి తెలిపారు.
కేంద్ర మంత్రి కిషన్రెడ్డి
హైదరాబాద్, జూన్ 17( ఆంధ్రజ్యోతి): హైకోర్టు న్యాయమూర్తుల పోస్టుల సంఖ్యను 24 నుంచి 42కు పెంచిన ఫైలుపై కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తన ముందే సంతకం చేశారని కేంద్ర మంత్రి జి.కిషన్రెడ్డి తెలిపారు. 2020 ఆగస్టు 26 బార్కౌన్సిల్ చైర్మన్ ఎ.నర్సింహారెడ్డి, అప్పటి ఎమ్మెల్సీ, న్యాయవాది ఎన్.రాంచందర్రావులు ఢిల్లీకి వచ్చినప్పుడు.. వారితో కలిసి రవిశంకర్ ప్రసాద్కు వినతిపత్రం అందజేశామన్నారు. ఆ తర్వాత కేంద్రమంత్రిని కలిసినప్పుడల్లా ఈ అంశాన్ని ప్రస్తావించేవాడినని తెలిపారు. ఎట్టకేలకు ఆయనే తనను పిలిచి తనముందే ఫైలుపై సంతకం చేశారన్నారు. బార్కౌన్సిల్ సభ్యులు గురువారం కిషన్రెడ్డిని సన్మానించగా ఈ సందర్భంగా ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. కిషన్రెడ్డిని సన్మానించిన వారిలో బార్కౌన్సిల్ చైర్మన్ ఎ.నర్సింహారెడ్డి, వైస్చైర్మన్ సునీల్గౌడ్, అడిషనల్ సొలిసిటర్ జనరల్ సూర్యకిరణ్రెడ్డి, సీనియర్ స్టాండింగ్ కౌన్సిల్ కె.రజిత ఉన్నారు.
Updated Date - 2021-06-18T09:15:08+05:30 IST