రేపటి కాంగ్రెస్ చలో రాజ్భవన్పై టెన్షన్ టెన్షన్
ABN, First Publish Date - 2021-07-15T20:58:02+05:30
పెట్రోల్ ధరల పెంపునకు నిరసనగా శుక్రవారం ‘చలో రాజ్భవన్’ కార్యక్రమాన్ని నిర్వహించాలని టీపీసీసీ నిర్ణయం తీసుకుంది.
హైదరాబాద్: పెట్రోల్ ధరల పెంపునకు నిరసనగా శుక్రవారం ‘చలో రాజ్భవన్’ కార్యక్రమాన్ని నిర్వహించాలని టీపీసీసీ నిర్ణయం తీసుకుంది. అయితే రేపటి కాంగ్రెస్ చలో రాజ్భవన్పై టెన్షన్ టెన్షన్ నెలకొంది. చలో రాజ్భవన్కు ఇప్పటివరకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. కాంగ్రెస్ నేతలు పెట్టుకున్న దరఖాస్తును తిరస్కరిస్తూ.. పోలీసులు లిఖిత పూర్వక సమాచారం ఇచ్చారు. శాంతి భద్రతల కారణంగా అనుమతివ్వలేమని పోలీసులు పేర్కొన్నారు. ఇందిరాపార్క్ దగ్గర కేవలం 2 మైక్లతో సభకు అనుమతి ఉందని, ఎట్టి పరిస్థితుల్లో కార్యక్రమాన్ని నిర్వహిస్తామంటున్న కాంగ్రెస్ నేతలు స్పష్టం చేస్తున్నారు.
Updated Date - 2021-07-15T20:58:02+05:30 IST