ఆదిలాబాద్ కలెక్టరేట్ దగ్గర ఉద్రిక్తత
ABN, First Publish Date - 2021-11-27T00:47:32+05:30
పట్టణంలోని కలెక్టరేట్ దగ్గర ఉద్రిక్త పరిస్థితులు
ఆదిలాబాద్: పట్టణంలోని కలెక్టరేట్ దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీఆర్ఎస్, ఆదివాసీ నాయకుల మధ్య తోపులాట జరిగింది. ఎమ్మెల్సీ బరిలో టీఆర్ఎస్, తుడుం దెబ్బ అభ్యర్థులు నిలుచున్నారు. ఎమ్మెల్సీ పోటీకి 24 నామినేషన్లు దాఖలు అయ్యాయి. వీటిలో 22 మంది తమ నామినేషన్ను ఉపసంహరించుకున్నారు. పుష్పరాణి నామినేషన్ను ఉపసంహరించేందుకు టీఆర్ఎస్ నాయకులు ప్రయత్నాలు చేశారు. నామినేషన్ ఉపసంహరణకు తాను ఎవరినీ పంపలేదని పుష్పరాణి పేర్కొంది. దీంతో నామినేషన్ల ఉపసంహరణలో వివాదం తలెత్తింది. ఏకగ్రీవ ప్రయత్నాలు విఫలం కావడంతో టీఆర్ఎస్ శ్రేణులు సహనం కోల్పోయాయి. ఆదివాసీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Updated Date - 2021-11-27T00:47:32+05:30 IST