ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేసీఆర్‌ కుటుంబం చేతిలో తెలంగాణ బందీ: షర్మిల

ABN, First Publish Date - 2021-10-28T02:14:22+05:30

తాలిబన్లు ఆప్ఘనిస్తాన్‌ను కబ్జా చేసినట్లు తెలంగాణ రాష్ట్రం కేసీఆర్‌ కుటుంబం చేతిలో బందీ అయ్యిందని వారి నుంచి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మహేశ్వరం: తాలిబన్లు ఆప్ఘనిస్తాన్‌ను కబ్జా చేసినట్లు తెలంగాణ రాష్ట్రం కేసీఆర్‌ కుటుంబం చేతిలో బందీ అయ్యిందని వారి నుంచి విముక్తి కల్గించాల్సిన అవసరముందని వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల అన్నారు. పాదయాత్రలో భాగంగా మాట ముచ్చట కార్యక్రమంలో షర్మిల మాట్లాడారు. ఏ భూమిలో ఏ పంట వేసుకోవాలనేది రైతుకు తెలుసని ఏ పంట సాగు చేయాలనేది కూడా పాలకులు చెప్పడం రైతు స్వేచ్ఛను హరించడమేనని విమర్శించారు. యాసంగిలో వరి సాగు చేయొద్దని చెప్పడాన్ని ఆమె తప్పుబట్టారు. ఎన్నికల ముందు సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీలను అమలు చేయలేదని ఆరోపించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు లోపించాయని చిన్నారులపై హత్యాచారాలు జరుగుతున్నాయంటే దీనికి సీఎం కేసీఆర్‌ బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు. పేదల బతుకులు బాగుపడాలని కేసీఆర్‌ను సీఎం చేశారని పేపరులాంటి బతుకమ్మ చీరల కోసం కాదని షర్మిల దుయ్యబట్టారు.

Updated Date - 2021-10-28T02:14:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising