ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ముగిసిన తెలంగాణ కేబినెట్ భేటీ.. కీలక పథకం అమలుకు సీఎం ఆదేశం

ABN, First Publish Date - 2021-08-02T03:01:58+05:30

ముగిసిన తెలంగాణ కేబినెట్ భేటీ.. కీలక పథకం అమలుకు సీఎం ఆదేశం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసింది. 57 ఏళ్లకు పెన్షన్ అమలు ప్రక్రియను ప్రారంభించాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. అందుకు సంబంధించిన ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని అధికారులకు ఆదేశించారు. ఈ నిర్ణయంతో మరో 6 లక్షల 62 వేల మంది కొత్త పెన్షనర్లు పెరగనున్నారు. కుటుంబంలో ఒక్కరికే  పింఛను పద్ధతిని కొనసాగించనున్నారు. భర్త చనిపోతే భార్యకు, భార్య చనిపోతే భర్తకు వెంటనే పెన్షన్ బదిలీ చేస్తారు. ఆగస్టు 15 నుంచి నెలాఖరు వరకు రూ.50 వేల వరకు ఉన్న పంట రుణాల మాఫీని పూర్తి చేయాలని కేబినెట్ నిర్ణయించింది. రాష్ట్రంలో 5 సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రుల ఏర్పాటుకు కేబినెట్‌ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కొత్తగా మంజూరైన 7 మెడికల్‌ కాలేజీలను వచ్చే విద్యాసంవత్సరం నుంచి ప్రారంభించాలని కేబినెట్ నిర్ణయించారు. మధ్యాహ్నం 2 గంటలకు భేటీ అయిన కేబినెట్.. పలు అంశాలపై సుధీర్ఘంగా చర్చించింది.

Updated Date - 2021-08-02T03:01:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising