ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మానవత్వం లేని సీఎం తెలంగాణను పాలిస్తున్నాడు: బండి సంజయ్‌

ABN, First Publish Date - 2021-12-27T23:55:48+05:30

మానవత్వం లేని సీఎం జగన్ తెలంగాణ రాష్ట్రాన్ని పాలిస్తున్నాడని బీజేపీ నేత బండి సంజయ్‌ ధ్వజమెత్తారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: మానవత్వం లేని సీఎం జగన్ తెలంగాణ రాష్ట్రాన్ని పాలిస్తున్నాడని బీజేపీ నేత బండి సంజయ్‌ ధ్వజమెత్తారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిరుద్యోగ దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ జనవరిలోపు నోటిఫికేషన్లు ఇవ్వకుంటే అసెంబ్లీ సమావేశాలను అడ్డుకుంటామని ప్రకటించారు. దొంగ దీక్షలు ఎలా చేయాలో.. మంత్రి కేటీఆర్ తన తండ్రిని అడిగి తెలుసుకోవాలన్నారు. 2009 కేసీఆర్ దీక్షపై ఖమ్మం డాక్టర్లు ఇచ్చిన రిపోర్ట్‌ను బయటపెడతామని హెచ్చరించారు. దీక్ష సమయంలో బాత్రూంలో ఇడ్లీలు తిన్న చరిత్ర కేసీఆర్‌దని ఆరోపించారు. దీక్ష పేరుతో ఢిల్లీ వెళ్లి కేసీఆర్‌ తాగిపడుకున్నాడని ఎద్దేవాచేశారు. ఉప ఎన్నికలప్పుడు మాత్రమే కేసీఆర్ ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తామంటాడని దుయ్యబట్టారు. ఉద్యోగాలు ఇవ్వకపోగా ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించడం దుర్మార్గమని బండి సంజయ్‌ మండిపడ్డారు.

Updated Date - 2021-12-27T23:55:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising