ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డ్రగ్స్‌ కేసులో ఈడీ ఎదుట హాజరైన తనీశ్‌

ABN, First Publish Date - 2021-09-18T08:56:56+05:30

డ్రగ్స్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సినీ నటు డు తనీశ్‌.. శుక్రవారం ఉదయం 10.30కు ఈడీ విచారణకు హాజరయ్యారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • 7 గంటల పాటు సాగిన విచారణ
  • 22న హాజరు కానున్న తరుణ్‌ 

హైదరాబాద్‌, సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యోతి): డ్రగ్స్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సినీ నటు డు తనీశ్‌.. శుక్రవారం ఉదయం 10.30కు ఈడీ విచారణకు హాజరయ్యారు. సాయంత్రం 5.30 వరకు ఆయనను ఈడీ అధికారులు విచారించారు. తనీశ్‌ తన బ్యాంకు ఖాతాల వివరాలు, వివిధ డాక్యుమెంట్లను ఈడీ అధికారులకు సమర్పించారు. డ్రగ్స్‌ కేసులో ప్రధాన నిందితులైన కెల్విన్‌, జిషాన్‌ అలీలతో ఉన్న ఆర్థిక లావాదేవీలపై ఈడీ అధికారులు తనీశ్‌ను ప్రశ్నించారు. అదేక్రమంలో పలువురు సినీ ప్రముఖుల నుంచి తనీశ్‌ బ్యాంకు ఖాతాలోకి నగదు బదిలీ అయిన విషయంపైనా విచారించారు. విచారణ అనంతరం తనీశ్‌ విలేకరులతో మాట్లాడు తూ.. తాను ఈడీ విచారణకు సహకరిస్తానన్నారు. కాగా, టాలీవుడ్‌ డ్రగ్స్‌ వ్యవహారంలో ఇప్పటికే పూరీ జగన్నాథ్‌, చార్మీకౌర్‌, రకుల్‌ ప్రీత్‌సింగ్‌, రాణా , రవితేజ, డ్రైవర్‌ శ్రీనివాస్‌, నందు, నవదీప్‌, ముమైత్‌ఖాన్‌, ఎఫ్‌క్లబ్‌ జనరల్‌ మేనేజర్‌ విచారణకు హాజరయ్యారు. 22న మరో నటుడు తరుణ్‌ ఈడీ ఎదుట హాజరుకానున్నారు.

Updated Date - 2021-09-18T08:56:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising