ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మా వాటా నీటిని సరఫరా చేయండి

ABN, First Publish Date - 2021-01-20T08:41:29+05:30

చెన్నై పట్టణ తాగునీటి కోసం కేటాయించిన నీటిని వెంటనే సరఫరా చేయాలని తమిళనాడు ప్రభుత్వం కృష్ణా బోర్డును కోరింది. చెన్నై తాగునీటి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 కృష్టా బోర్డును కోరిన తమిళనాడు           


హైదరాబాద్‌, జనవరి 19 (ఆంధ్రజ్యోతి) : చెన్నై పట్టణ తాగునీటి కోసం కేటాయించిన నీటిని వెంటనే సరఫరా చేయాలని తమిళనాడు ప్రభుత్వం కృష్ణా బోర్డును కోరింది. చెన్నై తాగునీటి అంశంపై కృష్ణా బోర్డు మంగళవారం ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించింది. బోర్డు చైర్మన్‌ పరమేశం ఆధ్వర్యంలో జరిగిన ఈ వెబినార్‌ సమావేశంలో తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర అధికారులు పాల్గొన్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు 6.95 టీఎంసీల నీటిని మాత్రమే సరఫరా చేశారని, మిగిలిన నీటిని ఇంకా విడుదల చేయలేదని తమిళనాడు అధికారులు చెప్పారు. ఎండలు మొదలు కాకముందే మిగిలిన నీటిని కూడా విడుదల చేయాలని కోరారు.  తమ కోటా నీటిని నేరుగా తమిళనాడుకు సరఫరా చేయాలని, ఈ విషయమై తమను ఏటా అడగాల్సిన అవసరంలేదని కర్ణాటక, మహారాష్ట్ర అధికారులు చెప్పారు. చెన్నై తాగునీటి సరఫరా కమిటీ నుంచి కూడా తమను తొలగించాలని కోరారు. ఈ ఏడాది మిగిలిన నీటిని కూడా త్వరగా చెన్నైకు విడుదల చేయాలని ఏపీ అధికారులకు బోర్డు చైర్మన్‌ సూచించారు.

Updated Date - 2021-01-20T08:41:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising