ఇద్దరు విద్యార్థులకు కరోనా పాజిటివ్
ABN, First Publish Date - 2021-03-05T05:34:35+05:30
ఇద్దరు విద్యార్థులకు కరోనా పాజిటివ్
మరిపెడ రూరల్(చిన్నగూడూరు), మార్చి 4: మండలంలోని ఎల్లంపేట జిల్లా పరిషత్ పాఠశాలలో ఒక విద్యార్థికి, చిన్నగూడూరు మండల కేంద్రంలోని గురుకులం విద్యార్థినికి కొవిడ్ పరీక్షల్లో పాజిటివ్గా రావడంతో వారిని క్వారంటైనలో ఉంచుతున్నట్లు పీహెచ్సీ డాక్టర్ రవి తెలిపారు. ఎల్లంపేట జిల్లా పరిషత్ పాఠశాలలో 108 మంది విద్యార్థులున్నారు. ఇటీవల హైదరబాద్ బంధువుల ఇంటి నుంచి పాఠశాలకు వచ్చిన 10వ తరగతి విద్యార్థికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు తెలిపారు. చిన్నగూడూరు మండల కేంద్రంలోని గురుకులం పాఠశాలలో 80 మంది విద్యార్థులు పరీక్షలు నిర్వహించగా ఓ విద్యార్థికి పాజిటివ్ వచ్చినట్లు తెలిపారు. వారిని హోం క్వారంటైన్ చేసినట్లు తెలిపారు.
Updated Date - 2021-03-05T05:34:35+05:30 IST