విద్యుదాఘాతంతో విద్యార్థి మృతి
ABN, First Publish Date - 2021-01-17T04:58:13+05:30
విద్యుదాఘాతంతో విద్యార్థి మృతి
ఏటూరునాగారం, జనవరి 16 : బిల్డింగ్పై ఆడుకుంటు న్న బాలుడికి 11 కేవీ విద్యుత్ వైర్లు తగలడంతో విద్యుదాఘాతంతో మృతి చెందాడు. మండలంలోని ఆకులవారి ఘణపురానికి చెందిన బొడ్డు రాంబాబు, రుద్ర దంపతుల కుమారుడు శివరాం ఆరో తరగతి చదువుతున్నా డు. శనివారం సాయంత్రం బిల్డింగ్పై ఆడుకుంటున్న శివరాం (14)కు ఇంటిపైన ఉన్న విద్యుత్ వైర్లు తగలడంతో అక్క డే కుప్పకూలిపోయాడు. కుటుంబీకులు మండలకేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి త రలించగా అప్పటికే పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ మృ తి చెందాడు. శివరాం తండ్రి ఫిర్యాదు మేరకు ఎస్సై-2 పిట్టల శ్యామ్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Updated Date - 2021-01-17T04:58:13+05:30 IST