సూర్యాపేటలో తండ్రిని హత్య చేసిన తనయుడు
ABN, First Publish Date - 2021-04-17T12:55:24+05:30
పెన్ పహాడ్ మండలంలో దారుణం జరిగింది. తండ్రి అంజి రెడ్డిని (70), తనయుడు నంద్యాల సమరసింహా రెడ్డి అతికిరాతకంగా హత్య...
సూర్యాపేట: పెన్ పహాడ్ మండలంలో దారుణం జరిగింది. తండ్రి అంజి రెడ్డిని (70), తనయుడు నంద్యాల సమరసింహా రెడ్డి అతికిరాతకంగా హత్య చేశాడు. కొన్ని రోజుల నుంచి జులాయిగా తిరుగుతున్న కొడుకును తండ్రి మందలించాడు. జులాయిగా ఎందుకు తిరుగుతున్నావని మందలించినందుకు తండ్రి మాటలను తట్టుకోలేక సహనం కోల్పోయిన తనయుడు శుక్రవారం అర్ధరాత్రి తండ్రిని హతమార్చాడు. ఈ ఘటన నారాయణ గూడెంలో చోటు చేసుకుంది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Updated Date - 2021-04-17T12:55:24+05:30 IST