‘ఔటర్’పై మరో ఆరు ట్రామా కేర్ సెంటర్లు
ABN, First Publish Date - 2021-10-17T09:41:59+05:30
ఔటర్ రింగ్ రోడ్డుపై జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో.. క్షతగాత్రుల ప్రాణాలు నిలపడమే లక్ష్యం గా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
హైదరాబాద్ సిటీ, అక్టోబర్ 16 (ఆంధ్రజ్యోతి): ఔటర్ రింగ్ రోడ్డుపై జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో.. క్షతగాత్రుల ప్రాణాలు నిలపడమే లక్ష్యం గా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక్కడ జాతీయ, రాష్ట్ర రహదారులు అనుసంధానమయ్యే ప్రాంతాల్లో ప్రస్తుతమున్న పది ట్రామా కేర్ సెం టర్లకు అదనంగా మరో ఆరు సెంటర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందుకుగాను మేడ్చల్, కొల్లూరు, తారమతిపేట, రావిర్యాల్, సుల్తాన్పూర్, పెద్దగోల్కొండ ఇంటర్చేంజ్ల వద్ద అందుబాటులో ఉన్న టోల్ బిల్డింగ్లలో ట్రామా కేర్ సెంటర్లు ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు.
Updated Date - 2021-10-17T09:41:59+05:30 IST