ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కిషన్‌రెడ్డిని కలిసిన ప్రజాగాయకుడు గద్దర్‌

ABN, First Publish Date - 2021-08-23T19:23:28+05:30

కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిని ప్రజాగాయకుడు గద్దర్‌ కలిశారు. దేశవ్యాప్తంగా తనపై ఉన్న కేసుల గురించి కిషన్‌రెడ్డితో ఆయన చర్చించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిని ప్రజాగాయకుడు గద్దర్‌ కలిశారు. దేశవ్యాప్తంగా తనపై ఉన్న కేసుల గురించి కిషన్‌రెడ్డితో ఆయన చర్చించారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌షా అపాయింట్‌మెంట్‌ ఇప్పించాలని గద్దర్ కోరారు. వివిధ రాష్ట్రాల్లో తనపై నమోదైన కేసులపై అమిత్‌షాకు వివరిస్తానని గద్దర్‌ తెలిపారు. గతంలో తనపై ఉన్న కేసులను ఎత్తివేయడానికి, న్యాయసహాయం అందించడానికి సీఎం కేసీఆర్‌ చొరవ తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. తాను 1990లో అప్పటి ప్రభుత్వ పిలుపు మేరకు నక్సలిజాన్ని వదిలి జనజీవన స్రవంతిలో కలిశానని తెలిపారు. 1997 ఏప్రిల్‌ 6న తనపై హత్యాయత్నం జరిగిందని, వెన్నుపూస దగ్గర ఓ బుల్లెట్‌ ఉందని పేర్కొన్నారు. అది అనేక అనారోగ్య సమస్యలకు కారణమైందని వాపోయారు. అప్పటి నుంచి డాక్టర్ల పర్యవేక్షణలో ఉంటున్నాని, అలాంటిది తాను పరారీలో ఉన్నానని ప్రచారం చేయడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. 

Updated Date - 2021-08-23T19:23:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising