ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎస్సై శ్రీనివాసరెడ్డిపై చర్యలు తీసుకోవాలి: పిల్లి సుధాకర్

ABN, First Publish Date - 2021-08-04T01:53:48+05:30

జిల్లా మరిపెడ పోలీస్‌స్టేషన్‌లో ట్రైనీ ఎస్సైపై అత్యాచారయత్నానికి పాల్పడిన ఎస్సై శ్రీనివాసరెడ్డిపై చర్యలు తీసుకోవాలంటూ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మహబూబాబాద్: జిల్లా మరిపెడ పోలీస్‌స్టేషన్‌లో ట్రైనీ ఎస్సైపై అత్యాచారయత్నానికి పాల్పడిన ఎస్సై శ్రీనివాసరెడ్డిపై చర్యలు తీసుకోవాలంటూ మహబూబాబాద్ పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం ముందు దళిత సంఘాలు ధర్నా చేపట్టారు. దళిత ట్రైనీ ఎస్సైకి న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్ మాట్లాడుతూ రాష్ట్రంలో మరియమ్మ ఘటనను మరచిపోకముందే ఓ ట్రైనీ ఎస్సైపై, ఎస్సై శ్రీనివాసరెడ్డి అత్యాచారానికి ఒడిగట్టడం శోషనీయమన్నారు. రాష్ట్రంలో ఒక దళిత ఎస్సైకే రక్షణ కరువైతే సామాన్యల పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఆలోచించాలన్నారు. దళిత బంధు కాదు.. దళితుల హక్కులను కాపాడాలని, నిందితుడిపై ఫోక్సో కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని తీవ్ర తరం చేస్తామని సుధాకర్ హెచ్చరించారు.

Updated Date - 2021-08-04T01:53:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising