ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాలమూరు మహిళలతో 8న షర్మిల ఆత్మీయ సమ్మేళనం

ABN, First Publish Date - 2021-03-02T21:11:20+05:30

జిల్లా మహిళలతో ఈ నెల 8న షర్మిల ఆత్మీయ సమ్మేళనం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మహబూబ్ నగర్: జిల్లా మహిళలతో ఈ నెల 8న షర్మిల ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు షర్మిల ప్రధాన అనుచరుడు రాఘవరెడ్డి తెలిపారు. ఆయన మాట్లాడుతూ వైఎస్‌ను తలచుకొని మహబూబ్ నగర్ అభిమానులు కంటతడి పెట్టుకున్నారన్నారు. టీఆర్ఎస్ జెండా కప్పుకున్నోళ్లకే సంక్షేమ పథకాలు అందుతున్నాయని ఆయన ఆరోపించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చెందించడంలో అన్ని రంగాల్లో టీఆర్ఎస్ సర్కార్ విఫలమైందని ఆయన విమర్శించారు.


వైఎస్‌ కుటుంబ సభ్యులపై రేవంత్ రెడ్డి ఇష్టారీతిన మాట్లాడితే  తెలంగాణ ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని ఆయన హెచ్చరించారు. చంద్రబాబుకు తొత్తులా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. రేవంత్ రెడ్డి లెక్క ఎంతని ఆయన ప్రశ్నించారు. ఓటుకు నోటు కొనుగోలు కేసులో 50 లక్షలు ఇస్తూ అడ్డంగా దొరికిన దొంగ రేవంత్ రెడ్డి అని, అలాంటి రేవంత్ రెడ్డికి వైఎస్ కుటుంబంపై మాట్లాడే అర్హత లేదని ఆయన మండిపడ్డారు. వైఎస్ కుటుంబంపై రేవంత్ రెడ్డి మర్యాదగా మాట్లాడాలని ఆయన సూచించారు. లేకుంటే రేవంత్ రెడ్డికి ప్రజలే బుద్ది చెబుతారని ఆయన హెచ్చరించారు. 

Updated Date - 2021-03-02T21:11:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising