మంత్రిగారి ముందు చూపు.. 4 స్థానాలకు దరఖాస్తు!
ABN, First Publish Date - 2021-03-04T18:28:24+05:30
మంత్రి సెల్లూర్ కె రాజు బాగా ముందుచూపుతో వ్యవహరిస్తున్నారని అన్నాడీఎంకే నేతలు గుసగుసలాడుకుం టున్నారు.
చెన్నై : రాష్ట్ర మంత్రి సెల్లూర్ కె రాజు బాగా ముందుచూపుతో వ్యవహరిస్తున్నారని అన్నాడీఎంకే నేతలు గుసగుసలాడుకుంటున్నారు. మదురై నగర జిల్లా కార్యదర్శి, మదురై పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యేగా వున్న ఆయనకు ఈసారి ఆ నియోజకవర్గం దక్కుతుందో లేదోనని సందేహం తలెత్తినట్టుంది. అందుకే ఆయన మదురై పశ్చిమం, దక్షిణం, ఉత్తరం, మధ్య నియోజకవర్గా లకు కూడా దరఖాస్తు చేసేసుకున్నారు. మంత్రి తీరుతో కార్యకర్తలు అయోమయంలో పడ్డారు. కానీ, మంత్రి గారు మాత్రం.. పోటీ చేయాలనుకొనే ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకోవచ్చని సెలవిచ్చారు. తాను నాలుగుచోట్ల దరఖాస్తు చేసుకున్నా, అధిష్ఠానం ఒక్క స్థానమే ఇస్తుందని, అక్కడి నుంచే పోటీ చేస్తానని తాపీగా చెబుతున్నారు. తాను నాలుగు నియోజకవర్గాల్లో పోటీచేసేలా దరఖాస్తు సమర్పించానని, అధిష్ఠానం కేటాయించే నియోజకవర్గంలో పోటీచేస్తానని తాపీగా జవాబిచ్చారు.
Updated Date - 2021-03-04T18:28:24+05:30 IST