ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రైవేటు బడుల్లోనూ శానిటైజేషన్‌: ట్రస్మా

ABN, First Publish Date - 2021-01-20T08:07:30+05:30

ప్రభుత్వ పాఠశాలల మాదిరిగానే, ప్రైవేట్‌ స్కూళ్లలోనూ శానిటైజేషన్‌ బాధ్యతలను స్థానిక సంస్థలకు అప్పగించాలని తెలంగాణ గుర్తింపు పొందిన పాఠశాలల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, జనవరి 19 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలల మాదిరిగానే, ప్రైవేట్‌ స్కూళ్లలోనూ శానిటైజేషన్‌ బాధ్యతలను స్థానిక సంస్థలకు అప్పగించాలని తెలంగాణ గుర్తింపు పొందిన పాఠశాలల యాజమాన్యాల సంఘం (ట్రస్మా) విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని కోరింది. జీవో-46 ప్రకారం ఇతర చార్జీలను వసూలు చేయకూడదని ఆదేశించినందున శానిటైజేషన్‌ భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని సంఘం రాష్ట్ర, అధ్యక్ష కార్యదర్శులు శేఖర్‌ రావు, మధుసూదన్‌ మంత్రిని మంగళవారం కలిసి విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ జీవో-46 ప్రకారం ఫీజులు చెల్లించేలా చూడాలని, విద్యార్థుల భద్రత దృష్ట్యా పాఠశాలల బోధన, బోధనేతర సిబ్బందిని ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌గా గుర్తించి వ్యాక్సినేషన్‌ సౌకర్యం కల్పించాలని కోరారు. ఈ విద్యాసంవత్సరాన్ని జూలై-31 వరకు పొడిగించాలని, మే నెలలో పదో తరగతి పరీక్షలు నిర్వహించేలా నోటిఫికేషన్‌ను విడుదల చేయాలని వారు మంత్రిని కోరారు.

Updated Date - 2021-01-20T08:07:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising