28 నుంచి రైతుబంధు నిధులు జమ
ABN, First Publish Date - 2021-12-19T02:23:23+05:30
రాష్ట్రంలో రైతుల అకౌంట్లో ఈ నెల 28 నుంచి రైతుబంధు
హైదరాబాద్: రాష్ట్రంలో రైతుల అకౌంట్లో ఈ నెల 28 నుంచి రైతుబంధు నిధులు జమ కానున్నాయని సీఎం కేసీఆర్ ప్రకటించారు. జిల్లా కలెక్టర్లతో ప్రగతి భవన్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పంట సాయం పంపిణీ ప్రారంభించిన పది రోజుల్లోనే రైతులందరికీ వారి ఖాతాల్లోనే నగదును జమ కానుందన్నారు. మొదటగా ఎకరం భూమి ఉన్న రైతులకు రైతుబంధు నిధులు జమ అవుతాయన్నారు. అనంతరం వరుసగా మిగితా రైతుల ఖాతాల్లో పెట్టుబడిని ప్రభుత్వం జమ చేయనుందన్నారు.
Updated Date - 2021-12-19T02:23:23+05:30 IST