ఎంజీబీఎస్లో ఆర్టీసీ ఎండీ ఆకస్మిక తనిఖీలు
ABN, First Publish Date - 2021-09-16T01:03:07+05:30
నగరంలోని ఎంజీబీఎస్లో ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆకస్మిక
హైదరాబాద్: నగరంలోని ఎంజీబీఎస్లో ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆకస్మిక తనిఖీలు చేసారు. బస్టాండ్లో పరిసరాల శుభ్రత, మరుగుదొడ్ల పరిశుభ్రతను మెరుగుపర్చాలని ఆర్టీసీ అధికారులను సజ్జనార్ ఆదేశించారు. పార్కింగ్ స్థలంలో చాలా కాలంగా పేరుకుపోయిన వాహనాలను తక్షణమే స్క్రాప్ యార్డ్కు తరలించాలని సజ్జనార్ ఆదేశించారు. బస్సులో సాధారణ వ్యక్తిగా సజ్జనార్ ప్రయాణించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణికుల సాధక, బాధకాలను సజ్జనార్ తెలుసుకున్నారు.
Updated Date - 2021-09-16T01:03:07+05:30 IST