తెలంగాణ అమరవీరుల కుటుంబాలను గుర్తించడంలో KCR Government విఫలం: రేవంత్
ABN, First Publish Date - 2021-11-21T17:50:19+05:30
తెలంగాణ అమరవీరుల కుటుంబాలను గుర్తించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఆదివారం మీడియా మీట్లో ఆయన మాట్లాడుతూ.. అమరవీరుల కుటుంబాలకు ఇప్పటి వరకు పరిహారం ఇవ్వలేదని
హైదరాబాద్: తెలంగాణ అమరవీరుల కుటుంబాలను గుర్తించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఆదివారం మీడియా మీట్లో ఆయన మాట్లాడుతూ.. అమరవీరుల కుటుంబాలకు ఇప్పటి వరకు పరిహారం ఇవ్వలేదని కేసీఆర్ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఎన్సీఆర్బీ నివేదిక ప్రకారం టీఆర్ఎస్ పాలనలో 7,500 మంది రైతులు మృతి చెందారని, బాధిత రైతు కుటుంబాలకు ఇప్పటికీ పరిహారం అందలేదని ప్రశ్నించారు. హైదరాబాద్లో వరద బాధితులకు కూడా పరిహారం ఇవ్వలేదని పేర్కొన్నారు. పంజాబ్లో చనిపోయిన రైతుల కుటుంబాలకు..రూ.3 లక్షలు ఇస్తామని కేసీఆర్ చెబుతున్నారు. తెలంగాణలో మరణించినవారికి ఇవ్వలేదు.. ఇప్పుడు సీఎం కేసీఆర్ను ఎలా నమ్మేదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
Updated Date - 2021-11-21T17:50:19+05:30 IST