మోదీ పాలన మెచ్చే బీజేపీలో చేరికలు
ABN, First Publish Date - 2021-04-22T05:36:40+05:30
మోదీ పాలన మెచ్చే బీజేపీలో చేరికలు
వరంగల్ టౌన్, ఏప్రిల్ 21: ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాలనను మెచ్చే అనేక మంది నాయకులు, కార్యకర్తలు బీజేపీలో చేరుతున్నారని ఆ పార్టీ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ, రూరల్ జిల్లా అధ్యక్షుడు కొండేటి శ్రీధర్ అన్నారు. బుధవారం 14వ డివిజన్ ఏనుమాముల బాలాజీనగర్లో డివిజన్ అధ్యక్షుడు ఉప్పునూతల నాగరాజు అధ్యక్షతన బీజేపీలో చేరికలు జరిగాయి. ఈ సందర్భంగా టీఆర్ఎస్ నేత గంధం కుమారస్వామి, సతీమణి లక్ష్మితో పాటు 500 మందితో బీజేపీలో చేరారు. వారికి రావు పద్మ, కొండేటి శ్రీధర్ పార్టీ కండువాలు కప్పి బీజేపీలోకి ఆహ్వానించారు. నాయకులు దామెర సదానందం, దండు చక్రపాణి, పస్తం సమ్మయ్య, కొత్తకొండ రాజు, యెలంశెట్టి వీరస్వామి, అపర్ణ, పస్తం సాంబయ్య, సతీ్షరెడ్డి, జంపయ్య, బాబురావు, లక్ష్మణ్, సతీష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2021-04-22T05:36:40+05:30 IST